విజయశాంతి, మహేష్ బాబు సెట్స్ లో ఒకరిని ఒకరు ఏమని పిలుచుకుంటారు?

విజయశాంతి, మహేష్ బాబు సెట్స్ లో ఒకరిని ఒకరు ఏమని పిలుచుకుంటారు?
విజయశాంతి, మహేష్ బాబు సెట్స్ లో ఒకరిని ఒకరు ఏమని పిలుచుకుంటారు?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగతి తెల్సిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాల్లో తిరిగి నటిస్తోంది విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ప్రొఫెసర్ భారతి పాత్ర చాలా మంచిదని, తనకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని తెలిశాకే ఒప్పుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది విజయశాంతి. ఇంకా ఆమె చిత్ర విశేషాలు హీరో మహేష్ బాబు గురించి ఆసక్తికర విశేషాలను పంచుకుంది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా రాజకీయాలే తన తొలి ప్రాధాన్యం అని చెప్పుకొచ్చింది విజయశాంతి. మహేష్ బాబు, విజయశాంతి కలిసి పాతికేళ్ల క్రితం నటించారు. అప్పుడు మహేష్ బాబు చైల్డ్ హీరో కాగా, విజయశాంతి టాప్ హీరోయిన్. పాతికేళ్ల తర్వాత మహేష్ బాబు టాప్ హీరో అయ్యాడు, సూపర్ స్టార్ గా ఎదిగాడు. విజయశాంతి చాలా కాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తిరిగి రీ ఎంట్రీ ఇస్తోంది.

మహేష్ బాబు ఇంత పెద్ద స్టార్ అవుతాడని అప్పట్లో అనుకున్నారా అన్న ప్రశ్నకు విజయశాంతి స్పందిస్తూ “బాబు హీరోగా చేసిన మొదటి సినిమా చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే చిన్నప్పుడు షాక్ అయ్యాను. కానీ తొలి సినిమాకు పూర్తిగా మారిపోయాడు. తొలి సినిమా చూసాకే అనుకున్నా, బాబు పెద్ద స్టార్ అవుతాడని. గతంలో ఇంటర్వ్యూలలో కూడా ఇది చెప్పాను. క్రికెట్ లో సచిన్ ఎలా టాప్ క్రికెటరో, తెలుగు సినిమాలకు మహేష్ అలా అని చెప్పాను, అన్నట్లుగానే మహేష్ ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడు” అని చెప్పింది. ఇక కృష్ణకు, మహేష్ కు ఉన్న తేడాలేంటి అని అడిగితే “కృష్ణ గారు చాలా మెత్తని స్వభావం కల వ్యక్తి. ఎదుటి వారి మనసును నొప్పించడం తెలీదు. మహేష్ అయితే పూర్తిగా డౌన్ టు ఎర్త్. తను అంత పెద్ద సూపర్ స్టార్ అని అతనికి గుర్తులేదు అనుకుంట. పెద్దలకు బాగా గౌరవ మర్యాదలు ఇస్తాడు. ఒక్కసారి కూడా తప్పుగా మాట్లాడడం నేను చూడలేదు. చాలా హంబుల్. సెట్ లో చాలా సరదాగా ఉంటూ అందరితోనూ కలిసిపోతుంటాడు” అని చెప్పింది విజయశాంతి.

ఇక సెట్ లో మహేష్, మీరు ఒకరినొకరు ఏమని పిలుచుకుంటారు అని అడుగగా నేను మహేష్ ను బాబు అని పిలుస్తాను. మొదటినుండి అదే అలవాటైంది. మహేష్ అని ఎందుకు పిలవనంటే హీరోకు గౌరవం ఇవ్వాలి. మహేష్ మాత్రం నన్ను అమ్మ, మేడం అని పిలుస్తాడు అని చెప్పింది.

సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలవుతోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో మహేష్, విజయశాంతికి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2C36yYd

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly