కేరళ వరదలు: నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విరాళం
కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినిమా ప్రముఖులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, కొరటాల శివ లాంటి విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తమ వంతు సహాయం అందించారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి సహాన నిధికి భారీ మొత్తం జమచేశారు. నాగార్జున దంపతులు నాగార్జున-అమల దంపతులు కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రూ. 28 లక్షలు అందజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు. కష్టకాలంలో వారికి మన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కేరళ ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు రావలన్నారు. ప్రభాస్, మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూ. 25 లక్షలు, బాహుబలి స్టార్ ప్రభాస్ రూ. 25 లక్షలు సహాయం అందించారు. . 25 లక్షలు అందించిన ఎన్టీఆర్ ‘అరవింద సమేత' షూటింగులో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.... షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన వెంటనే కేరళకు రూ. 25 లక్షలు విరాళం అందజేశారు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సోదరుడు, నటుడు, నిర్మాత కళ్యాణ్ రా...