ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న సీనియర్ హీరో
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరు అందమైన భామలు నయనతార , కీర్తి సురేష్ లతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు . ఇటీవలే పేట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజనీకాంత్ . తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది పేట కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు కాకపోతే తమిళంలో మాత్రం మంచి వసూళ్ల నే రాబట్టింది పేట . ఇక ఇప్పుడేమో ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రజనీ .
పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు రజనీకాంత్ కాగా ఈ చిత్రంలో నయనతార తో పాటుగా కీర్తి సురేష్ ని కూడా ఎంపిక చేసారు . ఇక ఈ సినిమాని మార్చి మొదటి వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు . మురుగదాస్ దర్శకుడు కాబట్టి ఈ సినిమాపై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి . యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
English Title: Nayanatara and Keerthy suresh in Rajinikanth’s next
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UbwjNj
Comments
Post a Comment