చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Pawan kalyan strong warning to chandrababu ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఆంధ్రపదేశ్ రాష్ట్ర రాజధాని కోసం మరో 2, 400 ఎకరాలను రైతుల నుండి బలవంతంగా లాక్కోవడానికి చంద్రబాబు నేతృత్వం లోని తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని ఒకవేళ అదే జరిగితే సహించేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేసాడు పవన్ కళ్యాణ్ . అమరావతి లో రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 32 వేల ఎకరాల భూములను తీసుకున్నారు చంద్రబాబు ప్రభుత్వం . దాంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి , కాగా ఇప్పుడేమో మరో రెండు వేల నాలుగు వందల ఎకరాలను బలవంతంగా గుంజు కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పవన్ ద్రుష్టి కి రావడంతో ఈ హెచ్చరికలు చేసాడు .

2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వగా గత ఏడాది కాలంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు . 2019 ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించాడు పవన్ . అప్పటి నుండి బాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉన్నాడు . తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నాడు . ఇక ఇప్పుడేమో మరోసారి రైతుల అంశాన్ని తెరమీదకు తెస్తున్నాడు . మొత్తానికి చంద్రబాబు కు 2019 ఎన్నికల్లో చుక్కలు కనిపించేలా ఉన్నాయి . పవన్ కళ్యాణ్ , జగన్ , బిజెపి ఇలా ముగ్గురితో తలపడాలి .

English Title: Pawan kalyan strong warning to chandrababu



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zdH0pp

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly